Minister Uttam Kumar on Telangana Water Projects :గత ప్రభుత్వ హయాంలో డ్యాంకు, బ్యారేజీకి తేడా లేకుండా నిర్మాణాలు చేశారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బ్యారేజీల నిర్మాణాలకు భారీగా డబ్బులు ఖర్చు చేశారని ఆరోపించారు. మూడు ఆనకట్టలపై విచారణ చేయాలని ఎన్డీఎస్ఏ (National Dam Safety Authority)ను కోరినట్లు తెలిపారు. వారి సిఫార్సుల ఆధారంగానే విచారణ చేయాలని పోలీసులను కోరతామని అన్నారు.
'నీ సలహాలు చాలు అని రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను ఇంట్లో కూర్చోబెట్టారు, ఇంకా ఆయన సలహాలు ఎందుకు? రాజరికంలా డబ్బులు ఖర్చు చేశారు. విజిలెన్స్ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ చేయాలని పోలీసులను కోరతాం. కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క, దేవాదుల ఆయకట్టు ఓవర్ ల్యాప్ అవుతున్నాయని సీడబ్ల్యూసీ వాళ్లు చెప్పారు. మేధావిలా కేసీఆర్ కట్టిన బ్యారేజ్ ఇలా అయింది, మళ్లీ ఇప్పుడు నింపాలని చెప్పడం బాధ్యతారాహిత్యం. విజిలెన్స్ నివేదికను పోలీసులకు ఇచ్చి విచారణ చేయాలని కోరతాం-' ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి
'కృష్ణా నదీ ప్రాజెక్టులపై వాస్తవాలు - కేసీఆర్ ప్రభుత్వ తప్పిదాలు' - అసెంబ్లీలో ప్రభుత్వం నోట్
Minister Uttam Kumar Request to NDSA Water Projects : రాష్ట్రంలో డ్యామ్, బ్యారేజీ నిర్మాణాల చేయడానికి వేల కోట్ల నష్టం జరిగిందని, దానికి బాధ్యులు ఎవరు అన్నది తేలుస్తామని తెలిపారు. కేసీఆర్ చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. నిన్నటి వరకు కేసీఆర్ ఎందుకు నోరు విప్పలేదు? ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పినట్లు నీరు నిల్వ చేసి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేమన్నారు. తమ్మిడిహట్టి చాలా మంచి డిజైన్ ప్రాజెక్ట్కన్నా ఆయన తక్కువ వ్యయంతో 16.5 లక్షల ఎకరాలకు నీరు వచ్చేదని తెలిపారు.