తెలంగాణ

telangana

ఆన్​లైన్ గేమ్స్ కోసం ఇంట్లో నగలు చోరీ - దొంగలు ఎత్తుకెళ్లారని కట్టుకథ - చివరి ట్విస్ట్ మాత్రం అదుర్స్! - Online Games Crime

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 7:40 AM IST

Hyderabad Young Lady Lost Money in Online Game : ఆన్​లైన్​ గేమ్​లకు అలవాటు పడిన ఓ యువతి సైబర్​ దాడికి గురైంది. ఆన్​లైన్ గేమ్స్ కోసం ఏకంగా ఇంట్లో నగలు అమ్మేసి పెట్టుబడి పెట్టింది. మోసపోవడంతో చివరికి కట్టుకథ అల్లి పోలీసులను బురిడీ కొట్టించాలని చూసింది. కానీ చివరకు దొరికేసింది.

Hyderabad Young Lady Loss Money in Online Game
Hyderabad Young Lady Loss Money in Online Game

Hyderabad Young Lady Lost Money in Online Game : ఇప్పుడున్న యువత పుస్తకాలు, ఆటలు మానేసి ఎంచక్కా సెల్​ఫోన్​లో సామాజిక మాధ్యమాలు, గేమ్​లు అంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆన్​లైన్​ గేమ్(Online Game Fraud)​లలో పడి సైబర్​ నేరాల బారిన పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అదే క్రమంలో సైబర్​ మోసానికి బలై లక్షల్లోనూ, వేలల్లోనూ డబ్బులు పోగొట్టుకుంటున్న అభాగ్యులు ఉన్నారు. తాజాగా హైదరాబాద్​లోని రాజేంద్రనగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆన్​లైన్​ గేమ్​లకు అలవాటు పడిన ఓ యువతి నగదు పోగొట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై పోలీసులు ముమ్మర దర్యాప్తు జరిపి చాకచక్యంగా ఆ యువతే అని గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : నగరంలోని రాజేంద్రనగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఎర్రబోడలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఓ యువతి ఆన్​లైన్​ గేమ్స్​కు అలవాటు పడింది. గేమ్​ ఆడుతుండగా అందులో కొంత జమచేస్తే ఎక్కువ మొత్తం వస్తాయని అలర్ట్​ వచ్చింది. ఎప్పటి నుంచో గేమ్స్ ఆడుతున్న ఆ యువతి అది నిజమేనేమోనని నమ్మి అందులో ముందుగా రూ.200 పంపించింది. అప్పుడు రూ.600లు వచ్చాయి.

చాలా సంతోషించిన ఆ యువతి ఇంకా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించింది. దీంతో ఆమె వేలల్లో అందులో జమ చేసింది. అలా రూ.30 వేలు వరకు జమ చేసిన తర్వాత నగదు తిరిగి రాలేదు. అంతటితో ఆగకుండా ఆ డబ్బెలాగైనా సంపాదించాలని ఇంట్లో ఉన్న కొద్దీ బంగారం విక్రయించి మరో రూ.35 వేల వరకు ఆ ఆన్​లైన్​ గేమింగ్​లో పెట్టింది. ఆ తర్వాత యువతి పెట్టిన డబ్బులు వెనక్కి తిరిగి రాకపోవడంతో సైబర్​ దాడిలో(Cyber Fraud in Hyderabad) మోసపోయానని గ్రహించింది.

ఆ​ యాప్​పై సైబర్​ దాడి​- హ్యాకర్ల చేతికి 70 లక్షల మంది వివరాలు!

Online Game Fraud in Hyderabad :ఈ విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో తెలియక అయోమయంలో పడింది. అదే బస్తీలో ఇటీవల ఇద్దరు ముసుగు దొంగలు హల్​చల్​ చేయడం గుర్తించింది. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుని ఆ యువతి ఒక కట్టుకథ అల్లింది. గురువారం ఉదయం ఇంట్లో బీరువాలోని సామగ్రిని చిందరవందరగా పడేసింది. తాను బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఇద్దరు ముసుగు దొంగలు ప్రవేశించారని గట్టిగా అరిచి స్థానికులను పిలిచింది.

స్థానికులు వచ్చాక దొంగలు పారిపోయినట్లు ఆ యువతి స్థానికులతో చెప్పింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు వారు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆ కేసును పోలీసులు చాలా సీరియస్​గా తీసుకుని వేగంగా స్పందించారు. ఆ యువతిని పూర్తి వివరాలు అడుగుతున్న క్రమంలో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించారు. అప్పుడు అది అంతా తాను అల్లిన కట్టుకథ అంటూ పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కు అయ్యారు.

సెర్చ్‌లో ఈ పొరపాట్లు చేస్తున్నారా?.. ఈ టిప్స్​ ఫాలో అవ్వకపోతే మీ బ్యాంక్‌ ఖాతా ఖాళీ!

ఆన్​లైన్​ రుణయాప్​ల కేసులో ఐదుగురు అరెస్టు.. కీలక సమాచారం స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details