తెలంగాణ

telangana

గత 30 ఏళ్లలో పూర్తికాని ప్రాజెక్టులను కేసీఆర్​ పాలనలో నాలుగేళ్లలోనే పూర్తి చేశాం : హరీశ్​రావు

By ETV Bharat Telangana Team

Published : Mar 11, 2024, 6:51 PM IST

BRS MLA Harish Rao about KCR on Kaleshwaram : గత ప్రభుత్వాల హయంలో 30 ఏళ్లలో పూర్తికాని ప్రాజెక్టులను కేసీఆర్​ పాలనలో నాలుగేళ్లలోనే పూర్తి చేశామని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. ఇవాళ సిద్దిపేటలోని పర్యటించిన ఆయన జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

Harish Rao about GramPanchayat Employees Wages
BRS MLA Harish Rao about KCR on Kaleshwaram

BRS MLA Harish Rao about KCR on Kaleshwaram :గత ప్రభుత్వాల హయాంలో 30 ఏళ్లలో పూర్తికాని ప్రాజెక్ట్​లను, కేసీఆర్ పాలనలో నాలుగేళ్లలోనే పూర్తి చేశామని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు తెలిపారు. రాష్ట్రంలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, సిద్దిపేటలోని చిన్న కోడూరు మండలంలో మాత్రం వేసవిలో కూడా చెరువులో నీళ్లు ఉన్నాయంటే దానికి కారణం కాళేశ్వరం, కేసీఆరే అని ఆయన అన్నారు. ఇవాళ సిద్దిపేటలో పర్యటించిన ఆయన, గణేశ్​ నగర్ హనుమాన్ దేవాలయం వద్ద శ్రీరామ కల్యాణ మండపం ప్రారంభించారు. అనంతరం చిన్న కోడూరు మండల కేంద్రంలో గౌడ కమ్యూనిటీ హల్​ను స్థానిక జడ్పీ ఛైర్మన్ రోజా శర్మతో కలిసి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పెద్ద కోడూరులో ఉచిత కుట్టు మిషన్​లను పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా మాజీ మంత్రి హరీశ్​రావు మాట్లాడారు. ఆంజనేయ స్వామి, తనకు ప్రజలకు సేవ చేసే శక్తి ఇచ్చారని, మానవుడు ఎంత సంపాదించినా దేవుని సన్నిధిలోనే మనశ్శాంతి దొరుకుతుందని హరీశ్​రావు అన్నారు. సిద్దిపేట గణేశ్​ నగర్ హనుమాన్ దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. హనుమాన్ మాల వేసిన స్వాములకు సేవ చేయడం, దేవునికి సేవ చేయడమే అని ఆయన తెలిపారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో గౌడ కమ్యూనిటీకి చెట్ల పన్ను రద్దు చేశామన్న ఆయన, వైన్స్ టెండర్లలో గీత కార్మికులకు రిజర్వేషన్లు తెచ్చిన ఘనత కేసీఆర్​కు దక్కిందన్నారు. 20 లక్షల రూపాయలతో గౌడ కమ్యూనిటీ భవనం ప్రారంభం చేశామని చెప్పారు.

'బోర్లు, మోటార్లు కాలిపోతున్నాయి. పొలాలు కూడా మేకలు పశువుల మేతకు అయిందన్న వార్తలు చూస్తున్నాం. కానీ మన చిన్న కోడూరులో మాత్రం పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయంటే అది కేసీఆర్​ కృషి. కాళేశ్వరం వల్లే చిన్న కోడూరు చెరువులో ఎండాకాలంలో కూడా నీళ్లు ఉన్నాయి. తెలంగాణ రావడం వల్ల, కేసీఆర్​ ముఖ్యమంత్రి కావడం వల్ల నీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం.'- హరీశ్​రావు, మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే

Harish Rao about GramPanchayat Employees Wages :గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులకు వెంటనే వేతనాలు ఇవ్వాలని హరీశ్​రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ సహా అనేక ముఖ్యమైన విధుల్లో నిత్యం శ్రమిస్తున్న 60 వేలకు పైగా గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులకు నెలల పాటు జీతాలు అందడం లేదని ఎక్స్​లో పేర్కొన్నారు. వేతనాలు అందక ఉద్యోగులు, కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పేద వర్గాలకు చెందిన వారి కష్టాలను అర్థం చేసుకొని, వెంటనే వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

గత 30 ఏళ్లలో పూర్తికాని ప్రాజెక్టులను కేసీఆర్​ పాలనలో నాలుగేళ్లలోని పూర్తి చేశాం : హరీశ్​ రావు

మేము గేట్లు తెరిస్తే బీఆర్​ఎస్​ ఖాళీ : మణుగూరు సభలో సీఎం రేవంత్​

యాదాద్రి ఆలయంలో భట్టి, సురేఖను సీఎం అవమానించారు: కవిత

ABOUT THE AUTHOR

...view details