తెలంగాణ

telangana

ఉప్పల్​ టెస్ట్​లో భారత్ ఓటమి - 7 వికెట్లతో చెలరేగిన ఇంగ్లాండ్​ స్పిన్నర్​

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 5:36 PM IST

Updated : Jan 28, 2024, 6:23 PM IST

Ind Vs Eng 1st Test Day 4 : మనోళ్లు తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యం సాధించినప్పటికీ విజయం కోసం తీవ్రంగా చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్ల పోరాటం చేసిన సరిపోలేదు. దీంతో ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టు నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యఛేదనలో 202 పరుగులకే భారత్​ ఆలౌట్ అయింది. ఫలితంగా తొలి టెస్టులో పర్యాటక జట్టు విజయం సాధించింది.

Ind Vs Eng 1st Test Day 4
Ind Vs Eng 1st Test Day 4

Ind Vs Eng 1st Test Day 4 :హైదరాబాద్‌ ఉప్పల్​ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్​పై భారత్ ఓటమి చెందింది. రెండో ఇన్సింగ్స్‌లో ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్​ 202 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మరొక రోజు ఆట మిగిలి ఉండగానే ఇంగ్లాండ్‌ 28 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. రోహిత్‌ (39), అశ్విన్‌(28), శ్రీకర్‌ భరత్‌(28), కేఎల్ రాహుల్‌ (22) పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు ఫెయిల్ అయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో టామ్‌ హార్ట్‌లే 7, జో రూట్‌, జాక్‌ లీచ్‌ చెరో వికెట్‌ తీశారు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

మ్యాచ్ సాగిందిలా : 231 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్​​ మంచి ఓపెనింగ్​ను అందించారు. జైశ్వాల్​ 15 పరుగులు చేసి ఔట్ అవ్వగా, రోహిత్ శర్మ 39 పరుగులు చేసి టామ్ హార్ట్​లే బౌలింగ్​లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన ప్లేయ‌ర్లు ఏవ‌రూ కూడా పెద్ద స్కోర్ చేయ‌లేకపోయాపరు. వరుసగా పెవిలియ‌న్​కు క్యూ క‌ట్టారు.

శుభ్​మన్ గిల్​ మరోసారి వచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయాడు. ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్​గా వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. నిలకడగా ఇన్నింగ్స్​ను ప్రారంభించి 22 పరుగులు చేసిన కేఎల్ రాహుల్​ను రూట్ దెబ్బకొట్టాడు. దీంతో భారత్ 32.4 ఓవర్లలో 107 పరుగులు చేసి ఐదో వికెట్​ను కోల్పోయింది. ఆ త‌ర్వాత బ్యాటింగ్​కు దిగిన ర‌వీంద్ర జ‌డేజా 119 ప‌రుగుల వ‌ద్ద ర‌నౌట్ కాగా, చివ‌ర‌ల్లో అశ్విన్(28), భ‌ర‌త్28) జ‌ట్టును గెలిపించే ప్ర‌యత్నం చేసినా ఫ‌లించ‌లేదు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్‌ అవ్వడం వల్ల భారత్ ఆశలు ఆవిరయ్యాయి. అశ్విన్ - భరత్ ఔట్ అయ్యాక బుమ్రా, సిరాజ్‌ కాసేపు క్రీజ్‌లో ఉండి పోరాడినప్పటికీ విజయతీరాలకు చేర్చలేకపోయారు.

కాగా, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్​లో 246 ప‌రుగులు చేయ‌గా, రెండో ఇన్నింగ్స్ లో 420 ప‌రుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్​లో భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా 4 వికెట్లు, ర‌విచంద్ర‌న్ అశ్విన్ 3, ర‌వీంద్ర జ‌డేజా 2 వికెట్లు తీశారు. భార‌త్ తొలి ఇన్నింగ్స్​లో 436 ప‌రుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్​లో 202 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో టామ్ హార్ట్​లే 7 విక‌ట్లు తీసి టీమ్​ఇండియా పతనాన్ని శాసించాడు.

​68 పరుగులకు 7 వికెట్లు - క్రికెట్​ స్టార్​గా మారిన సెక్యురిటీ గార్డు

విండీస్​ గెలుపుపై రియాక్షన్​ - స్టేడియంలో కన్నీళ్లు పెట్టుకున్న బ్రియాన్​ లారా

Last Updated : Jan 28, 2024, 6:23 PM IST

ABOUT THE AUTHOR

...view details