తెలంగాణ

telangana

ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే బీఆర్​ఎస్​ను రద్దు చేస్తారా? - హరీశ్‌రావుకు సీఎం రేవంత్​ రెడ్డి సవాల్ - CM Revanth Reddy Election Campaign

By ETV Bharat Telangana Team

Published : Apr 23, 2024, 6:21 PM IST

Updated : Apr 23, 2024, 7:31 PM IST

CM Revanth Reddy Challenge to Harish Rao : మాజీ మంత్రి హరీశ్​రావుకు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సవాల్​ విసిరారు. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్​ పార్టీని రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. కొడంగల్​లో కాంగ్రెస్​ కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న సీఎం, బీఆర్​ఎస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఏ రైతు అధైర్య పడాల్సిన అవసరం లేదని, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసే బాధ్యత తనదని పునరుద్ఘాటించారు.

CM Revanth Reddy Challenge to BRS Leaders
CM Revanth Reddy Challenge to Harish Rao

ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే బీఆర్​ఎస్​ను రద్దు చేస్తారా?: సీఎం రేవంత్​

CM Revanth Reddy Challenge to BRS Leaders : రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, బీఆర్​ఎస్​ నేతలకు సవాల్‌ విసిరారు. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే, బీఆర్​ఎస్​ను రద్దు చేసేందుకు సిద్ధమేనా అంటూ హరీశ్​రావుకు ఛాలెంజ్​ చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటించారు.

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డి, పార్టీ నేతలతో కలిసి నారాయణపేట జిల్లా మద్దూరులో జరిగిన కార్యకర్తల సమావేశానికి సీఎం హాజరయ్యారు. రైతుల రుణమాఫీ చేసి తీరుతామన్న సీఎం, బ్యాంకు అధికారులు అన్నదాతలను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. కాదని అలా చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. వచ్చే వరి పంటకు బోనస్‌ అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

"నేను చేసిన రుణమాఫీ ప్రకటనపై హరీశ్​రావు చేసిన సవాల్​కు నేను సిద్ధం. మరి రుణమాఫీ ఆగస్టు 15 లోపల పూర్తి చేస్తే బీఆర్​ఎస్​ పార్టీ రద్దు చేసేందుకు సిద్ధమా, దీన్ని మీరు స్వీకరిస్తారా? అదేవిధంగా రైతులతో బ్యాంకు అధికారులు జాగ్రత్తగా నడుచుకోవాలి. అన్నదాతల అప్పులకు వడ్డీతో సహా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. రైతులను ఇబ్బంది పెట్టొద్దు. కాదని ఇబ్బంది పెడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు." - రేవంత్ ​రెడ్డి, ముఖ్యమంత్రి

Revanth Reddy Comment on DK Aruna :పదేళ్ల కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం నాశనమైందని, ఒక్కో పనిని చక్కదిద్దుతూ, వారు చేసిన అప్పులు చెల్లిస్తూ వస్తున్నామన్నారు. పాలమూరు జిల్లాలో తనకు శత్రువులు లేరు ప్రత్యర్థులు లేరన్నారు. రాష్ట్రాన్ని పాలించే స్థాయిలో ఉన్నామని, అభివృద్ది చేసుకుందామన్నారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావుకు ఛాన్స్​ వస్తే, మళ్లీ ఇప్పుడు పాలమూరు బిడ్డకు దక్కిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో మంత్రిగా ఉన్న డీకే అరుణ, ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని, శత్రువు చేతిలో చురకత్తై పాలమూరు కంట్లో పొడుస్తున్నారని విమర్శించారు.

డీకే అరుణకు నాకు పోటీ ఏం ఉంటుంది :బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉండి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదో ప్రశ్నించానన్నారు. రేవంత్‌ రెడ్డికి, డీకే అరుణకు పోటీ ఎందుకు ఉంటుందన్నారు. ఆమె మీద ఎప్పుడూ కోపం, అసూయ చూపలేదని స్పష్టం చేశారు. పాలమూరు బిడ్డలు ఈ ప్రాంతం అబివృద్ది కోసం సహకరించాలనే తన ఆలోచన, పట్టుదల తప్ప ఎవరిమీదా ద్వేషం లేదన్నారు. అన్ని పార్టీలను పక్కనపెట్టి పాలమూరు అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

వంద రోజుల్లో 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేశామన్న సీఎం, పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్​ఎస్​ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. 'వరి వేయండి, చివరి గింజ వరకు కొంటాం' అని కేసీఆర్ అన్నారని, వరి వేశాక ధాన్యం కొనకుండా రైతులను ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. కొడంగల్​లో​ 50 వేల మెజార్టీ రావాలన్నారు.

మహిళలకు బొట్టు పెట్టి ఓట్లు అడగాలి :రాబోయే 20 రోజులు అత్యంత కీలకమని, కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని సూచించారు. మహిళలకు బొట్టు పెట్టి ఓట్లు అడగాలన్నారు. ఈ క్రమంలోనే దేవుడు గుడిలో, భక్తి గుండెల్లో ఉండాలని, బీజేపీ నేతలు దేవుడిని రోడ్లపైకి తెస్తున్నారని ధ్వజమెత్తారు. హిందూ మతంలోనే మత సామరస్యం ఉందన్నారు. కేసీఆర్​ను పాలమూరు ఎంపీగా గెలిపిస్తే అభివృద్ది చేయకుండా తాను ఫామ్​ హౌస్ కట్టుకున్నాడని విమర్శించారు.

రాష్ట్రంలో 5 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపిస్తానని మోదీతో కేసీఆర్‌ ఒప్పందం చేసుకున్నారు : సీఎం రేవంత్​ రెడ్డి - Revanth Reddy Election Campaign

రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం కీలక ప్రకటన - కోడ్​ ముగియగానే ప్రక్రియ ప్రారంభం - CM Revanth Reddy Election Campaign

Last Updated : Apr 23, 2024, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details