తెలంగాణ

telangana

రేవంత్​ రెడ్డిని కలిసిన భట్టి, దీపక్​ మున్షీ - మిగిలిన సీట్లపై చర్చ! - Lok Sabha Elections 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 8:38 PM IST

Bhatti and Deepak Munshi Meet CM Revanth Reddy : పెండింగ్​లో ఉన్న 3 లోక్​ సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు జరుగుతోంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీలు సమావేశమయ్యారు.

Congress Election Campaign in Telangana
Bhatti and Deepak Munshi Meet CM Revanth Reddy

Bhatti and Deepak Munshi Meet CM Revanth Reddy : ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపై చర్చించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీలు సీఎం రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ఇరువురు సీఎం నివాసానికి వెళ్లి కలిశారు. వీరు సుమారు 30 నిమిషాల పాటు చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ చర్చలో ప్రధానంగా రాష్ట్రంలో జరిగే తాజా రాజకీయ పరిణామాలతో పాటు పెండింగ్​లో ఉన్న మూడు లోక్​సభ అభ్యర్ధుల ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆదివారం హైదరాబాద్​కు ఏఐసీసీ(AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వస్తున్న సమయంలో కాంగ్రెస్​ ప్రముఖ నాయకుల చర్చ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టేందుకు రేవంత్ సైన్యం సిద్ధం - వాటికి ఆధారాలతో కూడిన కౌంటర్ - LOK SABHA ELECTIONS 2024

Congress Election Campaign in Telangana: మరోవైపు లోక్​సభ ఎన్నికల ఓటింగ్​ ప్రక్రియకు నెల రోజులు ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని మరింత జోరు పెంచింది. ఇప్పటికే ప్రచార రథాలను కాంగ్రెస్​ ప్రారంభించింది. ఆయా లోక్​సభ స్థానాల్లో ప్రకటించిన అభ్యర్థులు కార్యకర్తలతో జోష్​ని నింపి ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details