Bengaluru Water Crisis : కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి సంక్షోభం నెలకొందని సీఎం సిద్ధారామయ్య పేర్కొన్నారు. రోజుకు 2600 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) నీటి అవసరం ఉండగా దాదాపు 500 ఎంఎల్డీ కొరత ఉందని వెల్లడించారు. ఈ వ్యవహారంపై సోమవారం అధికారులతో సీఎం సమావేశమై సమస్య పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.