తెలంగాణ

telangana

అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్​ దంపతులకు 14 ఏళ్లు జైలు శిక్ష

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 11:04 AM IST

Updated : Jan 31, 2024, 11:40 AM IST

Imran Khan Jail Sentenced : తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం.

Imran Khan Jail Sentenced
Imran Khan Jail Sentenced

Imran Khan Jail Sentenced : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి 14 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ పాకిస్థాన్ కోర్టు తీర్పునిచ్చింది. అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసు ( సైఫర్ కేసు)లో ఇమ్రాన్​ ఖాన్​కు పదేళ్ల జైలు శిక్షను విధించిన మరుసటి రోజే పాకిస్థాన్ కోర్టు ఈ తీర్పును ప్రకటించింది.

కేసు ఏంటంటే?
ఇమ్రాన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో దాదాపు 58 ఖరీదైన కానుకలు అందుకున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. ఇక వాటిని సొంతం చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం సగం ధర చెల్లించి తీసుకోవాలి. కానీ, ఇందులో రూ.38 లక్షల రోలెక్స్‌ గడియారాన్ని ఇమ్రాన్​ కేవలం రూ.7.54 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. రూ.15 లక్షలు విలువ చేసే మరో రోలెక్స్‌ గడియారాన్ని రూ.2.94 లక్షలు మాత్రమే చెల్లించి తీసుకున్నారు. ఇలా మూడోవంతు కంటే తక్కువగా కట్టి, పలు కానుకలను ఇంటికి చేర్చుకున్న ఇమ్రాన్‌ రూ.8 లక్షల కానుకలను ఒక్క రూపాయి కూడా ఖజానాకు జమ చేయకుండానే తీసుకున్నారని, ఆ తర్వాత వాటిని దుబాయిలో అమ్ముకున్నారని పాక్​ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్ ఆరోపించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. గ్రాఫ్​ చేతి గడియారం, కఫ్​లింక్స్​, ఖరీదైన పెన్, ఉంగరం, నాలుగు రోలెక్స్ వాచ్​లు సహా మరికొన్ని కానుకల్ని మొత్తం రూ.2కోట్ల 15 లక్షల 60వేలకు తోషాఖానా నుంచి కొనుగోలు చేసినట్లు పాక్ ఎన్నికల సంఘానికి విచారణ సమయంలో తెలిపారు ఇమ్రాన్. వాటిని విక్రయిస్తే రూ.5కోట్ల 80లక్షలు వచ్చినట్లు వెల్లడించారు. అయితే ఈ ఆదాయం వివరాల్ని ఇన్​కమ్ ట్యాక్స్​ రిటర్నుల్లో చూపలేదు. ఫలితంగా ఇమ్రాన్​ ఖాన్​పై ఈసీ అనర్హత వేటు వేసింది. ఈ కేసులో ఇస్లామాబాద్‌లోని జిల్లా, సెషన్స్‌ కోర్టు ఆగస్టు 5న ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఆ తర్వాత కోర్టు తీర్పును సస్పెండ్ చేసింది. ఇప్పుడు పాకిస్థాన్ కోర్టు ఏకంగా 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది.

అధికారిక రహస్యపత్రాల దుర్వినియోగం కేసు (సైఫర్ కేసు)లో పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు మంగళవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇమ్రాన్ ఖాన్​, మాజీ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీకి ఒక్కొక్కరికి 10 ఏళ్ల జైలు శిక్షను విధించింది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి

Toshakhana Case Imran Khan : ఇమ్రాన్ ఖాన్​కు భారీ ఊరట.. అవినీతి కేసులో తీర్పు సస్పెన్షన్

Pakistan National Assembly Dissolved : పాక్​ జాతీయ అసెంబ్లీ రద్దు.. ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా?

Last Updated :Jan 31, 2024, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details