Side Effects Of Afternoon Sleep :చాలా మంది జనాలు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు పడుకుంటారు. ఒక అరగంట నుంచి గంట సేపు పడుకోవడం వల్ల అలసట తగ్గుతుందని, మనసు ప్రశాంతంగా ఉంటుందని చెబుతుంటారు. అయితే.. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలువస్తాయని మీకు తెలుసా? అవును.. ఇలా తిన్న తర్వాత వెంటనే పడుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే.. మధ్యాహ్నం తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎంత సేపు పడుకుంటే మంచిది ? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
జీర్ణ సమస్యలు :
తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణక్రియపై ప్రభావం పడుతుందని నిపుణులంటున్నారు. దీనివల్ల గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణసమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. 2017లో 'అలిమెంటరీ ఫార్మకాలజీ అండ్ థెరపిటిక్స్' జర్నల్లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకున్న వారిలో గ్యాస్, అజీర్ణం వంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ ఫీన్బెర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో పనిచేసే డాక్టర్ డేవిడ్ జె. డంకన్ పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత వెంటనే పడుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
గుండెల్లో మంట :
మధ్యాహ్న భోజనం తర్వాత వెంటనేపడుకోవడం వల్ల.. కడుపులోని ఆమ్లం ఛాతి వైపు పైకి ఎక్కి గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే తిన్న తర్వాత కొద్దిసేపు నడవాలని సూచిస్తున్నారు.
రాత్రిపూట నిద్ర పట్టట్లేదా? పడుకునే ఈ నీటితో స్నానం చేస్తే అంతా సెట్! - Warm Water Shower For Sleep
గురక వస్తుంది :
భోజనం తర్వాత వెంటనే పడుకోవడం వల్ల శ్వాస నాళాలు కుచించుకుపోతాయి. దీని వల్ల గురక సమస్య వస్తుందట.