Devara Second Heroine:యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో భారీ అంచనాలతో 'దేవర' తెరకెక్కుతోంది. దర్శకుడు కొరటాల ఈ సినిమాను కోస్టల్ బ్యాగ్డ్రాప్తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా రెండు పార్ట్లుగా డిజైన్ చేస్తున్నారు. రీసెంట్గా మూవీమేకర్స్ ఓ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్కు పరిచయం కానుంది. ఎన్టీఆర్తో జాన్వీ స్క్రీన్ షేర్ చేసుకోనుంది. అయితే రీసెంట్గా ఈ సినిమా గురించి మరో వార్త వైరలవుతోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండనుందట.
'దేవర'తో ఓ మరాఠీ నటి కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నట్లు ప్రచారం సాగుతోంది. మరాఠీ బ్యూటీ శ్రుతి మరాటే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించనుందట. 'దేవర'లో హీరో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేయనున్నారట. అందులో ఒక రోల్కు జాన్వీ హీరోయిన్గా నటించగా, రెండో పాత్రకోసం శ్రుతి మరాటే జతకట్టనుందని టాక్. కానీ, ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్ పేజ్లో షేర్ చేశారు. ఈ పోస్ట్కు నటి శ్రుతి కూడ స్పందించడం వల్ల ఇది నిజమేనని అంటున్నారు.
Devara Release: ఈ సినిమాను ఏప్రిల్ 5న గ్రాండ్గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అయితే మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాలో విలన్ రోల్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇటీవల గాయపడ్డారు. దీంతో ఆయన పూర్తిగా కోలుకుని మళ్లీ షూటింగ్కు రావడానికి కొంత టైమ్ పట్టేలా ఉందట. మరోవైపు షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, వీఎఫ్ఎక్స్ వర్క్స్ పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.