తెలంగాణ

telangana

ఫేస్‌బుక్ లైవ్‌లోనే కాల్పులు- శివసేన నేత మృతి, ఫడణవీస్ రాజీనామాకు డిమాండ్

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 7:45 AM IST

Updated : Feb 9, 2024, 9:11 AM IST

Shiv Sena Leader Son Shot Dead : శివసేన-యూబీటీ వర్గానికి చెందిన నాయకుడిపై ఓ సామాజిక కార్యకర్త ఫేస్‌బుక్ లైవ్‌లోనే కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కాల్పుల అనంతరం దుండగుడు కూడా తనను తాను కాల్చుకుని చనిపోయాడు.

Shiv Sena Leader Son Shot Dead
Shiv Sena Leader Son Shot Dead

Shiv Sena Leader Son Shot Dead :మహారాష్ట్రలో ఇటీవల శివసేన శిందే వర్గం నేతపై పోలీస్ స్టేషన్‌లోనే ఓ బీజేపీ ఎమ్మెల్యే కాల్పులకు పాల్పడిన ఘటన మరువకముందే ఇదే తరహాలో మరో ఘటన జరగడం కలకలం రేపింది. శివసేన-యూబీటీ వర్గానికి చెందిన నేత అభిషేక్ ఘోసాల్కర్‌పై సామాజిక కార్యకర్త మౌరిస్ నొరోన్హా ఫేస్‌బుక్ లైవ్‌లోనే కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం దుండగుడు కూడా తనను తాను కాల్చుకుని చనిపోయాడు. పశ్చిమ బోరివాలి శివారులోని ఐసీ కాలనీలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

ఘోసాల్కర్, నొరోన్హాకు వ్యక్తిగత శత్రుత్వం ఉందని పోలీసులు చెప్పారు. అయితే ఐసీ కాలనీ ప్రాంత అభివృద్ధి కోసం వారిద్దరూ ఓ అంగీకారానికి వచ్చారని స్పష్టం చేయడానికి ఫేస్‌బుక్ లైవ్ ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఘోసల్కర్ పొత్తికడుపు, భుజంపై నిందితుడు మౌరిస్ నొరోన్హా మూడు రౌండ్లు కాల్చినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.

ఈ ఘటనలో నిందితుడు అక్కడికక్కడే చనిపోగా అభిషేక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మాజీ ఎమ్మెల్యే వినోద్ ఘోసల్కర్ కుమారుడు అభిషేక్ మాజీ కార్పొరేటర్ అని తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం సీఎం శిందేను నిందితుడు మౌరిస్ నోరోన్హా కలిశాడనీ శివసేన-యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్‌ వేదికగా పెట్టిన పోస్ట్‌లో ఆరోపించారు. శివసేన శిందే వర్గంలో చేరాల్సిందిగా ఆయన నిందితుడిని కోరారని చెప్పారు. ఘటనకు బాధ్యత వహిస్తూ ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

వారం కాకముందే మరో ఘటన
Maharashtra BJP MLA Shooting :ఇటీవల మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన శిందే వర్గం- బీజేపీ వర్గం మధ్య అనూహ్య ఘటన జరిగింది. శిందే వర్గం నేత మహేశ్‌ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణ్‌పత్‌ గైక్వాడ్‌ కాల్పులు జరపడం కలకలం రేపింది. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఓ భూ వివాదం ఈ కాల్పులకు దారి తీసింది. కాల్పులకు పాల్పడిన ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఉత్తరాఖండ్​లో హింస- ఆరుగురు మృతి, 300 మందికిపైగా గాయాలు

ఫేస్‌బుక్ లైవ్‌లోనే కాల్పులు- శివసేన నేత మృతి, ఫడణవీస్ రాజీనామాకు డిమాండ్

Last Updated : Feb 9, 2024, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details