తెలంగాణ

telangana

దిల్లీ మద్యం కేసులో ఆప్​నకు షాక్​- మరో​ మంత్రికి ఈడీ సమన్లు - Kailash Gahlot Ed Summons

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 11:25 AM IST

Updated : Mar 30, 2024, 12:41 PM IST

Kailash Gahlot Ed Summons : దిల్లీ మద్యం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన మరో మంత్రికి ఈడీ సమన్లు జారీ చేసింది. శనివారమే విచారణకు రావాలంటూ నోటీసులివ్వగా అధికారుల ఎదుట హాజరయ్యారు.

Kailash Gahlot Ed Summons
Kailash Gahlot Ed Summons

Kailash Gahlot Ed Summons :దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్‌ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, ఆప్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌ను అరెస్ట్‌ చేసిన ఈడీ తాజాగా మరో మంత్రి కైలాస్‌ గహ్లోత్‌కు నోటీసులు పంపింది. శనివారం విచారణకు హాజరుకావాలని సూచించింది. దీంతో ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లారు.

నజఫ్‌గడ్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కైలాస్‌ గహ్లోత్‌ కేజ్రీవాల్‌ మంత్రివర్గంలో రవాణా, హోం, న్యాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. దిల్లీ మద్యం కేసులో దిల్లీ మంత్రి కైలాస్‌ గహ్లోత్‌ను ప్రశ్నించటంతోపాటు ఆయన వాంగ్మూలం నమోదు చేసేందుకు సమన్లు పంపినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.

మొబైల్ నంబర్లు మార్చిన కైలాస్
కాగా, దిల్లీ ప్రభుత్వం రూపొందించిన 2021-22 మద్యం పాలసీ విధాన రూపకల్పన, అమలు కోసం చేసిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేందర్ జైన్​లతో పాటు కైలాస్​ కూడా ఉన్నారు. మద్యం పాలసీ ముసాయిదాను తయారు చేసే సమయంలో దిల్లీలోని కైలాస్​ తన అధికారిక నివాసాన్ని అప్పటి ఆప్​ కమ్యూనికేషన్ ఇన్​చార్జ్ విజయ్ నాయర్​కు ఉపయోగించుకునేందుకు అనుమతిచ్చారని ఈడీ పేర్కొంది. కైలాస్ తన మొబైల్​ నంబర్లను సైతం మూడు సార్లు మార్చారని ఛార్జిషీట్​లో ఆరోపించింది.

'నలుగురి మాటలు చాలా?'
ఈ కేసులో ఇప్పటికే పలువురు ఆప్‌ నేతల ఇళ్లల్లో దర్యాప్తు అధికారులు సోదాలు జరిపారు. ఇక ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 1తో ఆయన కస్టడీ ముగియనుంది. ఇటీవల కోర్టు విచారణ సందర్భంగా జడ్జి అనుమతితో సీఎం స్వయంగా తన వాదనలు వినిపించారు. "నన్ను అరెస్ట్ చేశారు. ఏ కోర్టు కూడా నన్ను దోషిగా నిర్ధరించలేదు. అసలు నన్ను ఎందుకు అరెస్టు చేశారు? సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి నలుగురు వ్యక్తులు చేసిన ప్రకటనలు సరిపోతాయా?" అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

గ్యాంగ్​స్టర్​ ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలు పూర్తి- పోలీసుల పటిష్ఠ భద్రత మధ్య అంతిమ సంస్కారాలు - Mukhtar Ansari Funeral Rites

సీపీఐకి ఐటీ నోటీసులు- రూ.11కోట్లు ట్యాక్స్ కట్టాలట! - IT Notice to CPI

Last Updated : Mar 30, 2024, 12:41 PM IST

ABOUT THE AUTHOR

...view details