తెలంగాణ

telangana

హైదరాబాద్​ To తిరుపతి - IRCTC స్పెషల్​ ప్యాకేజీ- శ్రీవారి స్పెషల్​ దర్శనంతో పాటు మరెన్నో! - IRCTC Poorva Sandhya Tour Packages

By ETV Bharat Telangana Team

Published : Apr 26, 2024, 12:10 PM IST

IRCTC Tirupati Tour
IRCTC Tirupati Tour

IRCTC Tirupati Tour: ఈ సమ్మర్​లో తిరుపతి వెళ్లాలని ప్లాన్​ చేస్తున్నారా? తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు చుట్టుపక్కల ఆలయాలను చూడాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. పూర్వ సంధ్య పేరుతో టూర్​ ప్యాకేజీ ప్రకటించింది IRCTC టూరిజం. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..

IRCTC Poorva Sandhya Tour Packages: కలియుగ వైకుంఠం తిరుమలలో వెలసిన వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలా మంది అనుకుంటారు. దక్షిణ భారతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని పరితపిస్తుంటారు. అయితే, తిరుమల ప్రయాణమంటే మాటలా? అటు దర్శనంతో పాటు ఇటు ప్రయాణ టికెట్లూ ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాలంటే అందుకు తగినట్లుగా ప్లాన్‌ చేసుకోవాలి. కాగా, అలాంటి వారి కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. దర్శన టికెట్ల కోసం చింతించకుండా ఎంచక్కా స్వామి వారిని దర్శించుకోవచ్చు. తిరుమలతో పాటు చుట్టు పక్కల పుణ్యక్షేత్రాలనూ దర్శించుకోవచ్చు. మరి మీరు కూడా తిరుపతి ప్రయాణానికి సిద్ధమవుతుంటే ఈ ప్యాకేజీపై లుక్కేయండి..

‘పూర్వ సంధ్య టూర్(IRCTC Poorva Sandhya Tour) పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. మొత్తం 4 రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది. మే 3వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. తిరుపతితో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు ఆలయాలను కూడా సందర్శించవచ్చు.

ప్రయాణం ఇలా..

  • మొదటి రోజు లింగంపల్లి నుంచి సాయంత్రం 06:25 గంటలకు రైలు(Train No. 12734 Express) బయలుదేరుతుంది. సికింద్రాబాద్​కు 07:05 గంటలకు చేరుకుంటుంది. నల్గొండ నుంచి 08:35 గంటలకు బయలుదేరుతుంది. నైట్ అంతా జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 06:55 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కి తీసుకెళ్తారు. ఫ్రెషప్​ అనంతరం శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాల దర్శనం ఉంటుంది. ఆ తర్వాత.. శ్రీ కాళహస్తి, తిరుచానూరు ఆలయాన్ని సందర్శించాలి. తర్వాత హోటల్‌కి తిరిగి వెళ్తారు. రాత్రి తిరుపతిలో బస చేస్తారు.
  • మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. 08:30 గంటలకు వేంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. సాయంత్ర 06:20 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
  • నాలుగో రోజు ట్రైన్ నల్గొండ స్టేషన్​కు తెల్లవారుజామున 03:04 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌కు 05:35 గంటలకు, లింగంపల్లికి ఉదయం 06:55 గంటలకు రావటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ధరలు ఇలా:

  • స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 7720 గా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీ రూ. 5860, ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.5,660గా నిర్ణయించారు.
  • ఇక కంఫర్ట్ క్లాసులో చూస్తే సింగిల్ ఆక్యూపెన్సీ ధర రూ.9570గా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీ రూ. 7720, ట్రిపుల్ ఆక్యూపెన్సీ రూ.7510గా నిర్ధారించారు.
  • 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లల కోసం వేర్వురు ధరలు ఉన్నాయి.
  • ప్యాకేజీకి సంబంధించిన ఇతర వివరాలు, బుకింగ్‌ కోసం IRCTC Tourism వెబ్‌సైట్‌ను సందర్శించండి..

IRCTC తిరుమల స్పెషల్ టూర్ ప్యాకేజీ - తక్కువ ధరలోనే 3 రోజుల ట్రిప్ - స్పెషల్ దర్శనం కూడా! - IRCTC Tirumala Tour Package

షిరిడీ భక్తుల కోసం IRCTC రెండు సూపర్​ ప్యాకేజీలు - అతి తక్కువ ధరలో సాయి దర్శనం!

ABOUT THE AUTHOR

...view details