Live Video: టోల్​గేటు వద్ద అంబులెన్స్ బోల్తా.. నలుగురు మృతి

By

Published : Jul 20, 2022, 7:32 PM IST

Updated : Jul 20, 2022, 9:09 PM IST

thumbnail

కర్ణాటకలోని ఉడుపి జిల్లా శిరూరు టోల్​ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరగ్గా.. అంబులెన్స్​లోని నలుగురు మరణించారు. టోల్​గేట్​ వద్ద ఒక లేన్​కు బారికేడ్లు అడ్డుపెట్టిన సిబ్బంది అంబులెన్స్​ రావడం గుర్తించి హుటాహుటిన వాటిని తొలిగించారు. వేగంగా వస్తున్న అంబులెన్స్ డ్రైవర్.. కాస్త వేగం తగ్గించేందుకు బ్రేక్ వేశాడు. అయితే రోడ్డుపై వర్షపు నీరు నిలిచి ఉండటం వల్ల ఆ వాహనం అదుపు తప్పింది. అక్కడే ఉన్న ఓ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో అంబులెన్స్​ కోసం రోడ్డు క్లియర్ చేసేందుకు ప్రయత్నించిన ఓ సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

Last Updated : Jul 20, 2022, 9:09 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.