సెక్యూరిటీ గార్డును కొట్టి కట్టేసి.. పెట్రోల్​ బంకుల్లో లక్షలు చోరీ

By

Published : Jun 9, 2022, 3:29 PM IST

thumbnail

Petrol Pumps Theft: కేరళలో రెండు వేర్వేరు చోట్ల పెట్రోల్​ బంకుల్లో దొంగతనాలు చేశారు దుండగులు. మొత్తం లక్షా 80 వేల రూపాయలు ఎత్తుకెళ్లారు. కోజికోడ్​ జిల్లా కొట్టోళిలో తొలుత హెచ్​పీసీఎల్​ పెట్రోల్​ పంప్​లో సెక్యూరిటీ గార్డును దారుణంగా కొట్టి.. అనంతరం కట్టేసి రూ. 50 వేలు చోరీ చేశాడు ఓ వ్యక్తి. మాస్కు ధరించిన దుండగుడు సిబ్బందిని కొడుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. బుధవారం అర్ధరాత్రి ఆఫీస్​లోకి చొరబడ్డ దుండగుడు కారప్పొడి చల్లి సెక్యూరిటీ గార్డుపై దాడికి పాల్పడ్డాడు. ఎర్నాకుళంలో జరిగిన మరో ఘటనలో పెట్రోల్​ పంప్​లోకి అర్ధరాత్రి 3 గంటలకు ప్రవేశించిన మరో దుండగుడు.. రూ. 1.30 లక్షలు సహా 12 వేలు విలువచేసే ఓ ఫోన్​ను ఎత్తుకెళ్లారు. సీసీటీవీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.