గోదావరి ఉగ్రరూపం.. ఆ గ్రామాల్లో ఎటు చూసినా నీరే.. నిండుకుండలా డ్యామ్​!

By

Published : Jul 16, 2022, 4:03 PM IST

thumbnail

ఒడిశాలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మల్కాన్​గిరి జల్లాలోని ముంపు గ్రామాలు.. వరద వలయంలో చిక్కుకున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు.. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్​ సింగ్​ తెలిపారు. మరోవైపు, గుజరాత్​లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గోండల్​ జిల్లాలోని వెరి డ్యామ్​కు భారీగా వరద నీరు పోటెత్తుతుంది. డ్యామ్​ నిండుకుండలా మారడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.