ఎస్​బీఐ కస్టమర్​ సెంటర్​లో పట్టపగలే దోపిడీ, తలపై సుత్తితో కొట్టి

By

Published : Aug 25, 2022, 10:54 AM IST

thumbnail

ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​లో పట్టపగలే దుండగులు రెచ్చిపోతున్నారు. గతకొద్ది రోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రకాశ్​ అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఎస్​బీఐ కస్టమర్​ సర్వీస్​ సెంటర్​లో ఓ యువకుడు చోరీకి పాల్పడ్డాడు. సుత్తితో నిర్వాహకుడి తలపై బలంగా దాడి చేసి, కౌంటర్​లో ఉన్న సొమ్ము తీసుకుని పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన నిర్వాహకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్​ల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు. మరోవైపు, వృద్ధురాలిని తుపాకీతో బెదిరించి ఇద్దరు యువకులు దోపిడీకి యత్నించిన ఘటన కర్ణాటకలోని హసన్​ జిల్లాలో జరిగింది. కేఆర్​పురంలోని డీటీ ప్రకాశ్ ఇంటికి ఇద్దరు యువకులు.. డెలివరీ బాయ్​ అని చెప్పి డోర్​ బెల్​ కొట్టారు. వెంటనే ఓ వృద్ధురాలు బయటకు రాగా.. ఆమెను తుపాకీతో బెదిరించి బంగారు గొలుసు లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన బామ్మ.. గట్టిగా కేకలు పెట్టడం వల్ల దొంగలు పారిపోయారు. సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.