చిదంబరానికి నిరసన సెగ.. సొంత పార్టీ న్యాయవాదుల నుంచే..

By

Published : May 4, 2022, 5:52 PM IST

Updated : May 4, 2022, 10:22 PM IST

thumbnail

కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు పి.చిదంబరానికి నిరసన సెగ తగిలింది. ఓ కేసు వాదించడానికి కోల్​కతా హైకోర్టుకు ఆయన బుధవారం వెళ్లారు. ఒక్కసారిగా చుట్టుముట్టిన సొంత పార్టీ న్యాయవాదులు నిరసన తెలిపారు. చిదంబరానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల వస్త్రాలు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ బంగాల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓటమికి కారణం చిదంబరమేనని ఆరోపించారు. టీఎంసీ పార్టీ సానుభూతిపరుడు అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ కేసులో టీఎంసీ తరఫున వాదించడం వల్లే చిదంబరానికి నిరసన సెగ తగిలినట్లు తెలుస్తోంది. బెంగాల్‌లోని మెట్రో డైరీ సంస్థలోని కొన్ని వాటాలను తృణమూల్‌ ప్రభుత్వం ప్రైవేటు అగ్రో ప్రాసెసింగ్ కంఎపీ కేవెంటర్‌కు విక్రయించింది. అయితే ఈ విక్రయాన్ని సవాల్‌ చేస్తూ బెంగాల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అధిర్‌ రంజన్‌ చౌధరీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై బుధవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసులో చిదంబరం కేవెంటర్‌కు మద్దతుగా తృణమూల్‌ తరఫున వాదనలు వినిపించేందుకు కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో సొంత పార్టీ న్యాయవాదుల నుంచి నిరసన ఎదుర్కొన్నారు.

Last Updated : May 4, 2022, 10:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.