భాజపా- కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ.. పార్టీ కార్యాలయం ధ్వంసం
భాజపా- కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు మంగళవారం బాహాబాహీకి దిగారు. కర్రలు, కుర్చీలతో ఇరు పార్టీల కార్యకర్తలు దాడి చేసుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో ఈ ఘటన జరిగింది. దాడిలో ఇందోర్లోని భాజపా కార్యాలయం ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.