పరువు హత్య కలకలం.. ప్రేమ వివాహం చేసుకున్నాడని నడిరోడ్డుపై..

By

Published : Jul 27, 2023, 11:04 AM IST

thumbnail

Honor Killing Lakhimpur Kheri : ఉత్తర్​ప్రదేశ్​లోని లఖింపుర్​ ఖేరీలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్నాడని ఓ యువకుడిపై.. అతడి భార్య కుటుంబసభ్యులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కర్రలతో చితకబాది.. కాలితో తన్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడి దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి. అసలేం జరిగిందంటే?

Youth Beaten To Death With Sticks : ఖమారియా సీహెచ్​సీ వద్ద లవకుశ్ అనే యువకుడిపై.. రామ్​జీ వర్మ, మరొక వ్యక్తి కర్రలతో బాది.. కాలితో తన్నారు. వారికి సాధన వర్మ అనే మహిళ సాయపడింది. ఇద్దరు నిందితుల దాడిలో లవకుశ్​.. తీవ్రంగా గాయపడ్డాడు. దాడి సమయంలో చుట్టుపక్కల ప్రజలు ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. నిందితులు పరారైన అనంతరం.. లవకుశ్​ను ఖమారియా సీహెచ్​సీకి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పోలీసు కేసు పెట్టాలని.. అప్పుడే వైద్యం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో మార్గమధ్యలోనే లవకుశ్ మరణించాడు.  

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. లవకుశ్ మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని.. పోస్టుమార్టం పరీక్షకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. మృతుడు ఖమారియాలోని ఓ ట్రావెల్స్​లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.