పర్యటకులను హడలెత్తించిన ఏనుగు- ఫొటోలు తీసేసరికి ఆగ్రహంతో దాడి

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2023, 10:33 AM IST

Updated : Nov 23, 2023, 11:44 AM IST

thumbnail

wild Elephant Attack On Tourists In UP Viral Video : ఉత్తర్​ప్రదేశ్​లోని దుధ్వా టైగర్​ రిజర్వ్​ సందర్శనకు వెళ్లిన పర్యటకులను ఓ ఏనుగు వెంబడించింది. ఆ సమయంలో కొంతమంది పర్యటకులు సఫారీ కారులో ప్రయాణిస్తున్నారు. డ్రైవర్, టూరిస్ట్​ గైడ్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ఇదీ జరిగింది
లఖింపుర్ ఖేరిలోని దుధ్వా టైగర్ రిజర్వ్​ను సందర్శించడానికి కొంతమంది పర్యటకులు సఫారీ కారు(జిప్సీకారు)లో వెళ్లారు. కొంచం దూరం వెళ్లేసరికి అక్కడ వారికి ఓ ఏనుగుల గుంపు కనిపించింది. ఆ పర్యటకుల్లో కొంతమంది గజరాజుల ఫొటోలను తీసేందుకు కారులోంచి కిందికి దిగారు.  ఆ సమయంలో ఏనుగుల గుంపునుంచి ఓ గజరాజు పర్యటకులను వెంబడించింది. ఈ క్రమంలో జంగిల్ సఫారీ డ్రైవర్, గైడ్ అప్రమత్తతో టూరిస్ట్​లు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది. ఈ వీడియోను చూసిన కొందరు వన్యప్రాణి ప్రేమికులు ఘాటుగా స్పందించారు. అడవి జంతువులకు రెచ్చగొట్టేవిధంగా ప్రవర్తించరాదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. 

Last Updated : Nov 23, 2023, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.