7అడుగుల ఎత్తు, 5టన్నుల ఇసుక- విరాట్​ కోహ్లీ సైకత శిల్పం అదుర్స్​!

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 10:01 AM IST

thumbnail

Virat Kohli Sand Art : టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​, రన్నింగ్​ మెషిన్​ విరాట్​ కోహ్లీ నేడు (నవంబర్​ 5)న 35వ ఏట అడుగుపెట్టనున్నాడు. ఈ క్రమంలో ప్రపంచమంతట అతని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా బర్త్​డే విషెస్​ తెలుపుతున్నారు. అయితే ఓ అభిమాని మాత్రం విన్నూత్న రీతిలో విషెస్​ తెలిపారు. ఒడిశాకు చెందిన సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్.. పూరీ తీరంలో విరాట్​ రూపంలో ఓ సైకత శిల్పాన్ని తయారు చేశారు. సుమారు 5 టన్నుల ఇసుకతో ఏడు అడుగుల కోహ్లీ చిత్రాన్ని ఆయన రూపొందిచారు. భారత జెర్సీలో ఉన్న విరాట్​..  వెనక 35 బ్యాట్లతో ఆ చిత్రాన్ని చేశారు. ఈ శిల్పం తయారీలో సుదర్శన్​కు తన ట్రైనింగ్​ ఇన్​స్టిట్యూట్​ స్టూడెంట్స్ ​సహాయం చేశారట. ప్రస్తుతం ఆ సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. 

గతంలోనూ సుదర్శన్​.. విరాట్​ కోసం ఓ సైకత శిల్పాన్ని తయారు చేశారు. 2017లో విరాట్- అనుష్క వివాహ బంధంతో ఒక్కటైన సందర్భంగా..  క్రికెట్, సినిమా కలయికతో ఉన్న ఓ విరుష్క జోడి చక్కటి శిల్పాన్ని ఆయన రూపొందించారు. అందులో బంతి, బ్యాట్‌ని చుట్టుకున్న సినిమా రీల్‌తో.. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ వెడ్డింగ్ ఫొటోను సైకత శిల్పంగా మలిచారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.