SBI ఏటీఎంలో భారీ చోరీ- స్కార్పియోలో వచ్చి నిమిషాల్లోనే నగదు మాయం

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 11:18 AM IST

thumbnail

Uttarakhand SBI Atm Robbery CCTV Video : ఉత్తరాఖండ్​లోని రూడ్కీలో ఓ ఎస్​బీఐ ఏటీఎంలో భారీగా నగదు చోరీ జరిగింది. దుండగులు స్కార్పియో కారులో వచ్చి డబ్బులు కొట్టేశారు. గ్యాస్​కట్టర్​తో ఏటీఎం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. వారు రూ.15-17 లక్షలు నగదును ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
లక్సర్​ రూడ్కీ రోడ్డులో ఉన్న ఓ శివాలయం ముందు ఎస్​బీఐ ఏటీఎం ఉంది. శుక్రవారం అర్ధరాత్రి కొంతమంది దుండగులు స్కార్పియో కారులో వచ్చి ఏటీఎంలోకి వెళ్లారు. గ్యాస్​కట్టర్​ను ఉపయోగించి ఏటీఎంను పగల గొట్టారు. ఉదయం చూసేసరికి ఏటీఎం ధ్వంసం అయి ఉండడం వల్ల ఈ చోరీపై పోలీసులకు సమాచారం ఇచ్చారు బ్యాంకు అధికారులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దుండగులు ఏటీఎంలోని రూ.15-17 లక్షలను దోచుకెళ్లినట్లు సమాచారం. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్​పీ స్వపన్ కిశోర్ సింగ్ తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.