Train Derailed In UP : పట్టాలు తప్పిన సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​​.. అంతా సేఫ్​.. కానీ!

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2023, 7:31 AM IST

thumbnail

Train Derailed In UP : ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​ రైల్వే స్టేషన్​ సమీపంలో సుహైల్‌దేవ్​ సూపర్​ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఘాజీపుర్​ నుంచి దిల్లీలోని ఆనంద్​ విహార్ టెర్మినల్​​కు వెళ్తున్న సుహైల్‌దేవ్​ సూపర్​ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్​ సహా మరో రెండు కోచ్​లు పట్టాలు తప్పాయి. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 

త్రుటిలో తప్పిన ఈ పెను ప్రమాదం గురించి విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తిస్తామని ఉత్తర మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు. రైల్వే ట్రాక్​ పునరుద్ధరణ పనులు చేపట్టామని.. మిగతా రైళ్ల రాకపోకలు​ సాధారణంగానే జరుగుతున్నాయని ఆయన చెప్పారు. గ్రీన్ సిగ్నల్​ ఇచ్చిన వెంటనే రైలు ప్రయాగ్​రాజ్​ స్టేషన్​ నుంచి బయలుదేరిందని.. ఆ సమయంలోనే ప్లాట్​పామ్​ నెంబర్​ 6 వద్ద ఈ ఘటన జరిగిందని అధికారులు వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.