'సిర్పూర్ వాసులు నన్ను దత్తత తీసుకున్నారు'

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2023, 4:11 PM IST

thumbnail

RS Praveen Press Meet on Assembly Election Results : సిర్పూర్ నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ రహస్యంగా ఒక్కటి కావడంవల్లే బీఎస్పీ పార్టీ ఓడిపోయిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంతరం ప్రజలను భయపెట్టే దోపిడీ, భూకబ్జాదారులను ఓడించామన్నారు. ప్రజలు బహుజన గొంతుకగా నిల్చి బీఎస్పీకి కొత్త ఆశలు రేకెత్తించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నామని ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్ చెప్పారు. రాబోయే రోజుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి, తమ పార్టీ విజయం సాధించేందుకు శ్రేణులను సిద్ధం చేస్తామన్నారు. సిర్పూర్ ప్రాంత వాసులు తనను దత్తత తీసుకున్నారని తెలిపారు. తాను కూడా ఇక్కడే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ ఎంతటి త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారం చేపట్టకపోయినా సిర్పూర్​ ప్రజలకు బీఎస్పీ మేనిఫెస్టో ప్రకారం అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.