రైలు పట్టాలపై అడ్డంగా పడుకున్న వృద్ధుడు.. చాకచక్యంగా కాపాడిన లోకో ఇన్​స్పెక్టర్​

By

Published : Feb 28, 2023, 7:56 AM IST

thumbnail

ఆత్మహత్యకు ప్రయత్నించిన 65 ఏళ్ల వృద్ధుడిని కాపాడాడు ఓ లోకో ఇన్​స్పెక్టర్​​​​. పట్టాలపై పడుకున్న వృద్ధుడిని గమనించిన లోకో ఇన్స్​స్సెక్టర్​.. చాకచక్యంగా రైలును ఆపి వృద్ధుడిని రక్షించాడు. దూరం నుంచే వృద్ధుడిని చూసి రైలు స్పీడ్​ తగ్గించుకుంటూ వచ్చిన ఇన్​స్పెక్టర్​.. వృద్ధుడి దగ్గరకు వచ్చే సరికి పూర్తిగా ఆపాడు. బంగాల్​లో ఈ ఘటన జరిగింది.

ఆదివారం అలీపుర్​దౌర్ రైల్వే డివిజన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రోహిత్​ సర్కార్ అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవాలని న్యూ దోమోహని రైల్వే పోస్ట్ నెం. 43/24 సమీపంలో రైలు పట్టాలపై పడుకున్నాడు. దీన్ని రైలు లోకోపైలట్​, ఇన్​స్పెక్టర్ గమించారు. వెంటనే రైలును ఆపి ఆ వ్యక్తి కాపాడారు. కాగా తీవ్ర ఒత్తిడితోనే ఆ వృద్ధుడు చనిపోవాలనుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఎలాంటి పని దొరకపోవడం వల్లే తీవ్ర మనస్థాపానికి గురైనట్లు రోహిత్​ సర్కార్​​ తెలిపారు. ఘటనపై అలీపుర్​దార్ రైల్వే డివిజన్ డీఆర్​ఎమ్​ దిలీప్​ సింగ్​ స్పందించారు. వృద్ధుడి ప్రాణాలు కాపాడిన రైల్వే సిబ్బందిని ఆయన అభినందించారు. కేవలం సిబ్బంది అవగాహనతోనే ఇలాంటి మంచి పనులు జరుగుతాయని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.