'సనత్​నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే'

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2023, 5:24 PM IST

thumbnail

Talasani Srinivas Yadav Election Campaign : గతంలో ఉన్న నాయకులు సనత్​నగర్​లో అభివృద్ధి ఏమీ చేయలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బన్సీలాల్​పేట్ డివిజన్ పరిధిలోని ఎన్​బీటి నగర్, బండమైసమ్మ నగర్ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. సికింద్రాబాద్​లో సనత్​నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగాా అభివృద్ధి చేశానని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉండటమంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం తాను నిత్యం పాటుపడుతున్నట్లు వివరించారు. గతంతో పోలిస్తే సనత్​నగర్ చాలా అభివృద్ధి చెందిందన్నారు.   

Talasani on Sanathnagar Development : సనత్​నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తన హయాంలో సనత్​నగర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అభివృద్ధి కోసం కృషి చేస్తుందని అన్నారు. మిగతా పార్టీలు అధికారం కోసమే పోటీ చేస్తున్నాయని విమర్శించారు. మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.