ATM నుంచి డబ్బులకు బదులు పాములు!.. జనం పరుగో పరుగు

By

Published : May 24, 2023, 5:30 PM IST

Updated : May 24, 2023, 5:40 PM IST

thumbnail

సాధారణంగా ఏటీఎం సెంటర్​లో డెబిట్​ కార్డు ద్వారా మనం డబ్బులు విత్​డ్రా చేసుకుంటాం. అయితే ఏటీఎం కార్డు పెట్టగానే.. డబ్బులకు బదులు పాములు వస్తే?.. ఒక్కసారిగా షాక్​ అవుతాం కదా.. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఉత్తరాఖండ్​లోని నైనితాల్​ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఎదురైంది. అసలేం జరిగిందంటే?

ఇదీ జరిగింది..
జిల్లాలోని రామ్​నగర్​ కోసీ రోడ్డులో ఉన్న స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఏటీఎంకు డబ్బులు విత్​డ్రా చేసుకునేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. మెషీన్​లో ఏటీఎం​ కార్డు పెట్టగానే.. అతడికి పాము కనిపించింది. దీంతో ఒక్కసారి అతడు అరవడం వల్ల క్యూలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. ఆ తర్వాత అతడు ఏటీఎం సెక్యూరిటీ గార్డుకు విషయాన్ని తెలియజేశాడు. సమాచారం అందుకున్న బ్యాంకు అధికారులు ఏటీఎం వద్దకు చేరుకున్నారు.

అదే సమయంలో ఆ ప్రాంతంలోనే ఉన్న సేవ్​ ది స్నేక్​ అండ్​ వెల్ఫేర్​ సొసైటీ అధ్యక్షుడు చంద్రసేన్​ కశ్యప్ కూడా​ ఏటీఎం వద్దకు వచ్చారు. బ్యాంకు అధికారులు.. ఏటీఎం​ను​ తెరిచారు. అందులో పది పాము పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. చంద్రసేన్​.. ఆ పాములన్నింటినీ రక్షించి అడవిలోకి విడిచిపెట్టారు. ఆ పాము పిల్లలు చాలా విషపూరితమైనవని ఆయన తెలిపారు. ఏటీఎం​ నుంచి పాము బయటకు వచ్చిన నేపథ్యంలో.. బ్యాంకు అధికారులు యంత్రం మొత్తాన్ని క్షుణ్నంగా తనిఖీ చేశారు. కొంతసేపు ఏటీఎంను మూసేసి మళ్లీ తెరిచారు. 

Last Updated : May 24, 2023, 5:40 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.