స్కూల్ టాయిలెట్​లో 7 అడుగుల మొసలి.. రెండు గంటలు శ్రమించి..

By

Published : Apr 10, 2023, 8:34 PM IST

thumbnail

రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడు అడుగుల పొడవైన మొసలి కనిపించడం కలకలం రేపింది. స్కూల్​లోని టాయిలెట్​లో ఈ భారీ మొసలి కనిపించింది. ఉత్తర్​ప్రదేశ్ ఫిరోజాబాద్​లోని నాగ్లా పాసీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామస్థులు మొసలిని గమనించి బెదిరిపోయారు. భారీ సైజులో ఉన్న మొసలిని చూసి ఆందోళన చెందారు. టాయిలెట్​లో మొసలి నక్కి ఉండటాన్ని చూసి.. దాని జోలికి వెళ్లకుండా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మొసలిని తీసుకెళ్లిపోవాలని కోరారు. వెంటనే వణ్యప్రాణి సంరక్షణ బృందాలతో కలిసి అటవీ అధికారులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. రెండు గంటల పాటు శ్రమించి మొసలిని సురక్షితంగా పట్టుకున్నారు. దాన్ని ఓ ఇనుప బోనులో బంధించి తీసుకెళ్లారు. గోపాల్​పుర్ కెనాల్​లో మొసలిని విడిచిపెట్టినట్లు అటవీ శాఖ అధికారి సురేంద్ర కుమార్ సారస్వత్ వెల్లడించారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం సెలవు రోజు కావడం వల్ల స్కూల్​లో విద్యార్థులు ఎవరూ లేరని స్థానికులు చెబుతున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైందని అంటున్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.