చేపలనూనె డబ్బాల మధ్యలో బంగారం స్మగ్లింగ్​

By

Published : Mar 28, 2023, 11:26 AM IST

thumbnail

Gold smuggling: బంగారాన్ని అక్రమంగా స్మగ్లింగ్​ చేసే స్మగ్లర్లు.. రోజుకో కొత్త దారులను వెతుక్కుంటున్నారు. వారు ఎన్ని విధాలుగా బంగారాన్ని అక్రమంగా తరలిద్దామని చూసినాసరే.. కస్టమ్స్​ అధికారులు మాత్రం వారిపై జూలువిదుల్చుతున్నారు. ఈరోజు శంషాబాద్​ విమానాశ్రయంలో ఇద్దరు స్మగ్లర్​లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.24 కేజీలు బరువు ఉండి రూ. 66.24 లక్షల విలువ చేసే గోల్డ్​ను పట్టుకున్నారు. వీరిని పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు కస్టమ్స్​ అధికారులు తెలిపారు.

ఈరోజు తెల్లవారు జామున 02:55 గంటలకు శంషాబాద్​ విమానాశ్రయంలో దుబాయ్​ నుంచి ప్రయాణికుడి నుంచి 840 గ్రాముల గోల్డ్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 51.24 లక్షలుగా ఉంటుందని కస్టమ్స్​ ఎయిర్​ ఇంటెలిజెన్స్​ అధికారులు వివరించారు. అనుమానం వచ్చి ప్రయాణికుడిని తనిఖీ చేయగా 3 క్యాప్సల్స్​ రూపంలో ఉన్న బంగారం పేస్టుగా ఉండడాన్ని గుర్తించారు. 

మరోవైపు ఇంకొక వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 03:45 గంటలకు దుబాయ్​ నుంచే వ్యక్తిని అనుమానం వచ్చి బ్యాగ్​ తనిఖీ చేయగా.. టూనా చేపల నూనె డబ్బాల మధ్య పెట్టుకుని 233 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 14.23 లక్షలు ఉంటుందని తెలిపారు. వీరి ఇద్దరినీ ఇండియన్​ కస్టమ్స్​ చట్టం 1962 ప్రకారం అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.