Rajnath Singh Fires on Telangana Government : 'కేసీఆర్ సర్కార్ అవినీతి దిల్లీ వరకు వినిపిస్తోంది'

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2023, 9:11 PM IST

thumbnail

Rajnath Singh Fires on Telangana Government : ఈరోజు సభల్లో ప్రజలను చూస్తుంటే.. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని అనిపిస్తోందని కేంద్ర మంత్రి రాజ్​నాథ్​సింగ్ (Rajnath Singh) అన్నారు. అభివృద్ధి పేరుతో కేసీఆర్ తెలంగాణను వెనుకబడిన ప్రాంతంగా మార్చారని ఆరోపించారు. పదేళ్లుగా అధికారంలో ఉన్నా ఏం చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం వనరులను దోచుకుని.. తెలంగాణను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా చేశారని దుయ్యబట్టారు. హైదరాబాద్​ బండగ్​పేటలో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

BJP Jana Garjana Sabha in Badangpet : కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇస్తుందని రాజ్​నాథ్​సింగ్ అన్నారు. కానీ బీఆర్ఎస్​ సర్కార్ సహకరించడం లేదని ఆరోపించారు. తెలంగాణలో అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ సర్కార్ అవినీతి దిల్లీ వరకు వినిపిస్తోందని విమర్శించారు. మొదట రాష్ట్రం అనే అభిప్రాయం ఉన్నవారిని ఇక్కడి ప్రజలు కోరుకున్నారని.. కానీ ఫ్యామిలీ ఫస్ట్​ అనే వ్యక్తుల చేతిలో రాష్ట్రం ఉందని ధ్వజమెత్తారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.