ఈ నెల 18కి హైదరాబాద్​కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అధికారుల కాన్వాయ్ రిహార్సల్

By ETV Bharat Telangana Team

Published : Dec 16, 2023, 9:00 PM IST

thumbnail

President Draupadi Murmu Winter Session in Telangana : శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. ఆమె పర్యటన నేపథ్యంలో అధికారులు కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. హకీంపేట్ విమానాశ్రయం నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయం చేరుకున్న తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వరకు అధికారులు కాన్వాయ్​ రిహార్సల్ చేశారు. ఈ నెల 18 నుంచి 23 వరకు రాష్ట్రపతి పర్యటించనున్నారని అధికారులు తెలిపారు.  

President Murmu Visit Hyderabad : రాష్ట్రపతి ఐదు రోజల పాటు నగరంలో ఉండనున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలను తీసుకున్నామని అధికారులు తెలియజేశారు. రాష్ట్రపతి ముర్ము ఈ నెల 23న మధ్యాహ్నం తిరిగి దిల్లీకి బయలుదేరనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఒమన్ సుల్తానేట్​ రాష్ట్ర అధిపతి హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్‌ భారతదేశ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఈరోజు ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ లాంఛనంగా రాష్ట్రపతి భవన్‌లో స్వాగతం పలికారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.