రెండో రోజు అదే ఉత్సాహం - ప్రజాదర్బార్​కు విశేష స్పందన

By ETV Bharat Telangana Team

Published : Dec 9, 2023, 3:41 PM IST

thumbnail

Praja Darbar Second Day in Jyotirao Phule Praja Bhavan at Hyderabad : హైదరాబాద్​లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్​లో శనివారం నిర్వహించిన రెండోరోజు ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు పెద్ద ఎత్తున ప్రజాదర్బార్‌(Praja Darbar)కు హాజరయ్యారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్​ఏ కమిషనర్ నవీన్​ మిత్తల్​ వినతులు స్వీకరించారు. స్వయంగా ఆయనే అప్లికేషన్లు స్వీకరిస్తూ ప్రజలు ఇచ్చిన విజ్ఞాపనలను నమోదు చేసుకున్నారు. ఈ ప్రజా సమస్యలు అన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. 

Jyotirao Phule Praja Bhavan at Hyderabad : ఆయనతో పాటు హైదరాబాద్​ అదనపు కలెక్టర్​ మధుసూదన్​, జీహెచ్​ఎంసీ అధికారులు ముషారఫ్​ అలీ, రవికుమార్​లు ప్రజా దర్బార్​ నిర్వహణను సమన్వయం చేశారు. ప్రజలు తమ అవసరాలను తీర్చాలని ప్రజా దర్బార్​ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. చాలా మంది ఇదే ప్రగతి భవన్​ నిర్మించిన తర్వాత రావడం అంటూ హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వానికి తెలిపామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.