అతివేగంతో వచ్చి కారు బోల్తా.. బైకర్లపైకి దూసుకెళ్లిన వాహనం.. పెట్రోల్​ బంక్​ సమీపంలోనే..

By

Published : Apr 29, 2023, 10:23 AM IST

thumbnail

ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కారు బోల్తాపడి అక్కడే ఉన్న బైకర్లపైకి దూసుకెళ్లింది. పెట్రోల్​ బంక్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో కారు డ్రైవర్​ సహా నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అసలేం జరిగిందంటే?  
శుక్రవారం మధ్యాహ్నం.. తిలా షాహబాజ్​పుర్​ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా రోడ్డుకు అడ్డం వచ్చిన బైక్​ను తప్పించబోయి కారు బోల్తాపడింది. కారు అప్పటికే అతి వేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న యువకులపైకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులతో పాటు కారు డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారంతా దిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. పెట్రోల్ బంక్​లో ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. అదుపుతప్పిన కారు.. పెట్రోల్ బంక్​ లోపలకు దూసుకెళ్లి ఉంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.