నల్గొండలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు బోల్తా - అందులో 30 మంది ప్రయాణికులు

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2023, 10:36 AM IST

thumbnail

Nalgonda Bus Accident Today  : రాష్ట్రంలో జరిగిన  రెండు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా... పలువురు గాయపడ్డారు. నల్గొండ జిల్లా చింతపల్లి సాయిబాబా గుడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి  పెళ్లి బృందం బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు సమాచారం.

పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..   గుంటూరు జిల్లా వినుకొండలోని పెళ్లిక హాజరైన తిరుగు ప్రయాణంలో హైదరాబాద్​కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో క్షతగాత్రుల  హాహాకారాలతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం శోకసంద్రంలో మునిగిపోయింది. క్షతగాత్రులను హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

Rangareddy Bus Accident Today : మరోవైపు.. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ మండలంలో  ఆర్టీసీ బస్సు కంటైనర్​ను ఢీ కొట్టింది. నందిగామ వద్ద తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.