MLC Palla Controversy Latest : 'ఆ మాటలు నావి కావు.. నేనలా అన్లేదు'.. పక్కా ప్రూఫ్ ఉన్నా.. మాట మార్చిన పల్లా

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2023, 3:15 PM IST

thumbnail

MLC Palla Controversy Latest : హనుమకొండ జిల్లా వేలేరు మండలం శోడషపల్లిలో జనగామ ప్రాంతానికి చెందిన నాయకులతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇతర పార్టీల నుంచి బీఆర్​ఎస్​లో చేరిన ఎమ్మెల్యేలను.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి కుక్కలతో పోల్చారు. అధికార పార్టీపై మొరిగే కుక్కలను పిల్లులుగా మార్చేందుకే కేసీఆర్ వారిని బీఆర్ఎస్​లో చేర్చుకుంటున్నారని వివాదాస్పద కామెంట్స్ చేశారు.

'ఒకసారి సీఎం సార్​ను ఇదే విషయం అడిగాను. బీఆర్ఎస్​లో 88 మంది ఎమ్మెల్యేలున్నా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఎందుకని అడిగాను. దానికి ఆయన ఏం చెప్పారంటే.. అటువైపు(కాంగ్రెస్​లో) ఉన్నప్పుడు కుక్కల్లా మొరుగుతారని.. వారిని పార్టీలో చేర్చుకుని పిల్లుల్లాగా మార్చానని చెప్పారు.' అని ఆ సమావేశంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

MLC Rajeshwar Reddy Controversial Comments : ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్​గా మారింది. దీనిపై కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్​లో చేరిన ఎమ్మెల్యేలు.. నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పల్లా ఈ వీడియోపై స్పందించారు. కొందరు.. తన మాటలను వక్రీకరించారని అన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన పల్లా... ఎవరినీ కించపరిచేలా తాను వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.