డిసెంబర్ ఆఖరిలో రైతుబంధు 100 శాతం ఇస్తాం : పొన్నం ప్రభాకర్

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2023, 1:53 PM IST

thumbnail

Minister Ponnam Prabhakar Clarity on Rythu Bandhu Scheme : రైతుకు పెట్టుబడి 100 శాతం ఇస్తామని  బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత ప్రభుత్వం డిసెంబర్ ఆఖరిలో ఇచ్చేదని, తాము కూడా అలాగే ఇస్తామని వెల్లడించారు. ⁠బీఆర్ఎస్​ ప్రతిపక్షంలోకి రాగానే రైతుబంధు ఎప్పుడు ఇస్తారని మాజీ మంత్రులు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా గజ్వేల్​కు వచ్చిన పొన్నం ప్రభాకర్​కు డీసీసీ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన గజ్వేల్​లో మాట్లాడారు. 

Ponnam Prabhakar Fires on BRS Leaders : ఈ నెల 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తే, 9న 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను ప్రారంభించామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ⁠రవాణా శాఖ పరిధిలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ⁠ఇచ్చిన ప్రకారం 6 గ్యారంటీలను 100 రోజుల్లో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ⁠ఈ ప్రభుత్వాన్ని నడవనీయమని ప్రతిపక్షాలు అంటున్నారని ధ్వజమెత్తారు. 

గతంలో ఇచ్చిన విధంగానే రైతుబంధు ఇస్తామని, కేసీఆర్ గజ్వేల్ నుంచి గెలిచాక ఒక్కసారైనా ఇక్కడి ప్రజలను కలవలేదని మంత్రి పొన్నం మండిపడ్డారు. ప్రగతిభవనాన్ని ప్రజాభవన్​గా మార్చామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను అక్కడ తెలుసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజాస్వామ్య పాలనను అందిస్తామని, భూ నిర్వాసితులతో కూలంకషంగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హమీ ఇచ్చారు. ⁠రైతుబంధులోని లోపాలను సవరించి వీలైనంత త్వరలో రైతు బంధు నగదు అందిస్తామని పొన్నం ప్రభాకర్ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.