ఉచిత ప్రయాణానికి అద్భుత స్పందన - త్వరలోనే 2 వేల కొత్త బస్సులు : మంత్రి పొన్నం ప్రభాకర్

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2023, 6:59 PM IST

thumbnail

Minister ponnam Prabhakar about free Bus Travel : కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు సంతోషంగా ఉపయోగించుకుంటున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇప్పటి వరకు నాలుగు కోట్లకుపైగా మహిళలు ఉపయోగించుకున్నారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్​లో మంత్రి పొన్నం ప్రభాకర్​ ఉచిత బస్సు ప్రయాణం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్​లో ఉన్న షాపింగ్​ల ఆదాయం పెరిగిందని అన్నారు.

Minister ponnam Prabhakar in Nizamabad Bus Stand : రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల కొరత ఉందని, దానిని కేబినెట్ మీటింగ్​లో పరిశీలించడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్​ గుర్తు చేశారు. త్వరలోనే 2000 కొత్త బస్సులు వస్తాయని మంత్రి తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేసినందుకు మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్​ మేనిఫెస్టో ప్రకటించిన ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానిదని, వాటిపై ఎవరైనా కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.