Karnataka Bus Fire In Maharashtra : ఆగని మరాఠాల ఆందోళనలు.. కర్ణాటక ఆర్​టీసీ బస్సుకు నిప్పు.. ప్రయాణికులు సేఫ్​!

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 12:29 PM IST

thumbnail

Karnataka Bus Fire In Maharashtra : మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్​లు కల్పించాలంటూ జరుగుతున్న నిరసనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోమవారం ఉదయం ఎన్​సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్​ సోలంకే ఇంటికి, ఆపై జిల్లా మున్సిపల్​ కార్యాలయానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ ఆర్​టీసీ బస్సుకు నిప్పంటించారు. కర్ణాటక నుంచి ప్రయాణికులతో మహారాష్ట్రలోని ఓమెర్గాకు వస్తున్న KA38F1201 నంబర్​ బస్సును సోమవారం రాత్రి 8:30 నిమిషాల సమయంలో దగ్ధం చేశారు మరాఠా నిరసనకారులు. అంతేకాకుండా రోడ్లను దిగ్బంధనం చేశారు. స్థానికంగా బంద్​లకు పిలుపునిస్తున్నారు. ఇక బస్సు ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న ఉమర్గా పోలీస్ ఇన్స్పెక్టర్ డీ.బీ.పాలేకర్​ సంఘటనా స్థలిని పరిశీలించారు. బస్సుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు.. ఫైర్ ఇంజన్​ వచ్చేలోపే బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. 

మరోవైపు.. నిరసనలు మరింత తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం జరగకుండా ధారాశివ్​ జిల్లాలో కర్ఫ్యూ విధించారు ఆ జిల్లా కలెక్టర్​​ డా.సచిన్​ ఓంబసే. రవాణా, అత్యవసర సేవలు సహా మరికొన్నింటికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో ఐదుగురు కంటే ఎక్కువ మంది రోడ్లపై తిరగరాదని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.