రెచ్చిపోయిన దొంగలు.. గన్స్​తో వచ్చి చోరీ.. అడ్డొచ్చిన యజమాని హత్య

By

Published : Jun 27, 2022, 4:38 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

thumbnail

బిహార్​లో దొంగలు రెచ్చిపోయారు. వైశాలి జిల్లాలోని హజిపుర్ పట్టణంలో ఓ ఆభరణాల దుకాణాన్ని దోచేశారు. ఐదారుగురు ఆయుధాలతో వచ్చి చోరీకి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన నగల దుకాణం యజమానిని దుండగులు చంపేశారు. దొంగలను నిలువరించేందుకు యజమాని సునీల్ కుమార్ ప్రయత్నించగా.. ఆయనకు బుల్లెట్ గాయాలు అయినట్లు తెలుస్తోంది. దొంగతనం జరిగిన నీలమ్ జ్యుయలరీ పట్టణ నడిబొడ్డున ఉండటం గమనార్హం. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ ఘటన జూన్ 22న రాత్రి 8 గంటలకు జరిగింది.

Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.