కిక్కిరిసిన నిర్మల్​ బస్టాండ్​ - సీటు కోసం డ్రైవర్​ క్యాబిన్​ ద్వారా బస్సు ఎక్కిన మహిళా ప్రయాణికులు

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2023, 4:56 PM IST

Updated : Dec 10, 2023, 8:04 PM IST

thumbnail

Huge Crowd at RTC Bus Stand : రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది. దీంతో ఆర్టీసీ బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా నిర్మల్​ జిల్లా కేంద్రంలోని మహిళా ప్రయాణికులతో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. నిర్మల్​ నుంచి ఆదిలాబాద్​ వెళ్లే ఆర్టీసీ బస్సులో ఎక్కేందుకు ప్రయాణికులు పోటీపడ్డారు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువ ఉండడంతో బస్సులో సీటు దొరుకుతుందో లేదో అని కొందరు మహిళలు డ్రైవర్​ క్యాబిన్​ ద్వారా బస్సు ఎక్కారు. దీంతో అక్కడున్న ప్రయాణికులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. నిర్మల్​ బస్టాండ్​లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.  

Free Bus Scheme for women : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీలలో నిన్న రెండు పథకాలను అమలు చేసింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు, బాలికలకు, ట్రాన్స్​జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీని ద్వారా వారు ఆర్డినరీ, ఎక్స్​ప్రెస్​, పల్లె వెలుగు, సిటీ మెట్రో బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. 

Last Updated : Dec 10, 2023, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.