రాజ్​భవన్​లో ఘనంగా సంక్రాంతి సంబురాలు

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2024, 11:45 AM IST

thumbnail

Governor Tamilisai Celebrates Sankranti At Raj Bhavan : తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సంక్రాంతి అందరికీ స్పెషల్ అని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం దిల్లీ పర్యటన వెళ్తున్నానని ఇది రాజకీయ పర్యటన కాదని గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్ భవన్​లో సంక్రాంతి వేడుకలను గవర్నర్ తమిళిసై ఘనంగా ప్రారంభించారు. రాజ్​భవన్​లోని ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. 

Sankranti Celebrations In Rajbhavan : హైదరాబాద్‌లోని రాజ్​భవన్‌లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఈ వేడుకలో పాల్గొని ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో అయోధ్యలో రామ మందిరం ప్రారంభం అవుతుందని అందుకే ఈ సంక్రాంతి పండుగ అందరికి ప్రత్యేకమేనని చెప్పారు. రామ్ మందిర్ పాటను తెలుగు, హిందీలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.