Ganesh Nimajjanam 2023 Celebrations : భాగ్యనగరంలో చురుగ్గా గణేశ్ నిమజ్జనాలు.. కోలాహలంగా మారిన ట్యాంక్​బండ్​

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2023, 4:06 PM IST

thumbnail

Ganesh Immersion 2023 Celebrations :  హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనాలు(Ganesh Immersion 2023) చురుగ్గా సాగుతున్నాయి. నవరాత్రుల పాటు ఘనంగా పూజలందుకున్న ఏకదంతుడు.. గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. నగరంలో ట్యాంక్​బండ్​ పరిసరాలు కోలాహలంగా మారాయి. భాగ్యనగరవాసులు గతేడాదికి మించి ఈసారి రికార్డు స్థాయిలో గణేశ్​ ప్రతిమలు ఏర్పాటు చేశారు. 

నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఇప్పటికే పలు విగ్రహాల నిమజ్జనాలు ప్రారంభం కాగా.. పోలీసులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పూర్తి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఖైరతాబాద్​ బడా గణేశ్​ నిమజ్జనం పూర్తయ్యింది. ట్యాంక్​బండ్​ నాలుగో క్రేన్​ వద్ద నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశారు. మరోవైపు బాలాపూర్​ గణేశుడు ఎంజేమార్కెట్​ వరకు చేరుకున్నాడు. బాలపూర్​ గణేశ్​ వెంట.. పాతబస్తీ వినాయకులు తరలివస్తున్నారు. నగరంలో గణేశ్​ నిమజ్జన ఉత్సవాలను.. హెలికాప్టర్‌లో ఏరియల్‌ వ్యూ ద్వారా మంత్రులు తలసానీ, మహమూద్​ అలీ.. రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్​ పరిశీలించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.