రాజేంద్రనగర్‌లోని కట్టెల గోదాంలో అగ్ని ప్రమాదం - తప్పిన ప్రాణాపాయం

By ETV Bharat Telangana Team

Published : Dec 27, 2023, 12:43 PM IST

thumbnail

Fire Accident In Rangareddy : రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లోని ఎంఎం పహాడీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కట్టెల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గోదాం పక్కనే ఉన్న ఇంటి గోడలు వేడి కారణంగా పాక్షికంగా దెబ్బతిన్నాయి. స్థానికులు అప్రమత్తం కావటంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. మంటలు ఇతర ఇళ్లకు వ్యాపించకుండా ఫైర్​ సిబ్బంది చర్యలు తీసుకున్నారు.

Rajendranagar Fire Accident : రాజేంద్ర నగర్‌లోని కాలనీ మధ్యలో గోదాం ఉంచటం చాలా ఇబ్బందిగా ఉందని స్థానికులు వాపోతున్నారు.  గతంలో పలుమార్లు ఈ తరహా అగ్ని ప్రమాదాలు జరిగాయని తెలిపారు. ఇళ్ల మధ్య నుంచి గోదాంనుని తొలగించాలని పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్​తో అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.