చెప్పులతో కొట్టుకున్న బీజేపీ కార్యకర్తలు.. ఎమ్మెల్యే సమక్షంలోనే గొడవ

By

Published : Apr 24, 2023, 8:50 PM IST

thumbnail

ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​ జిల్లాలోని బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయంలో కార్యకర్తలు వీరంగం సృష్టించారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లను తమకు కేటాయించలేదనే ఆరోపణతో రెండు వర్గాలు తీవ్ర వాగ్వాదానికి దిగాయి. గాజియాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ సందర్భంగా సోమవారం ఈ ఘర్షణ జరిగింది. ఈ గొడవలో కార్యకర్తలు ఒకరిపై ఒకరు చెప్పులతో దాడికి దిగారు. అంతేకాకుండా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఖోడా మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ ఆదేశాల మేరకే తమకు దక్కాల్సిన టిక్కెట్లను రద్దు చేశారని కార్యకర్తలు ఆరోపించారు. ఆ సమయంలో సాహిబాబాద్ బీజేపీ ఎమ్మెల్యే సునీల్ శర్మ కూడా అక్కడే ఉన్నారు. అయితే నామినేషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్​ కూడా బీజేపీ మేయర్ అభ్యర్థి సునీతా దయాళ్​తో కలిసి గాజియాబాద్​లో పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యే ఆఫీస్​కు సమీపంలోని మేయర్​ నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ ఘర్షణ సమయంలో అక్కడే ఉన్న బీజేపీ మేయర్ అభ్యర్థి సునీతా దయాళ్​ నామినేషన్​ దాఖలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తంగా కార్పొరేషన్​లోని కార్పొరేటర్​ పదవులకు ఇచ్చే టికెట్లు తమకు కాదని కావాల్సిన వారికే ఇచ్చారని ఖోడా మున్సిపాలిటీ చైర్‌పర్సన్ రీనా భాటికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు కార్యకర్తలు. కొందరు వ్యక్తులు నేతలతో కుమ్మక్కై టికెట్లు కొనుగోళ్లు చేశారని వారు ఆరోపించారు. ఈ గొడవ సమయంలో పలువురు సీనియర్ నేతలు కూడా కార్యాలయంలోనే ఉన్నారు. ఇక ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.