మా సత్తా ఏంటో ఇప్పుడు చూపిస్తాం - మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాట్ కామెంట్స్

By ETV Bharat Telangana Team

Published : Dec 15, 2023, 1:01 PM IST

thumbnail

Ex MLA Shankar Nayak comments on Congress Govt : కాంగ్రెస్ పార్టీకి 90 రోజుల తర్వాత అసలు విషయం తెలుస్తుందని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్​ నాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. బీఆర్​ఎస్ అసలు సత్తా చూపిస్తామన్నారు. 

తమను ఆపే శక్తి ఎవరికీ లేదని శంకర్​ నాయక్​ పేర్కొన్నారు. నియోజకవర్గ కార్యకర్తలకు తాను 24 గంటలూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కొంతమంది పార్టీలో ఉంటూ తనను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​లోనే ఉంటూ కాంగ్రెస్​ కోసం పని చేశారని దుయ్యబట్టారు. తాను భూ కబ్జాలకు పాల్పడ్డానని అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు. వాటిని నిరూపించాలని సవాల్ విసిరినా ఎవరు నిరూపించలేకపోయారన్నారు. మానుకోటలో బీఆర్​ఎస్​ చేసిన అభివృద్ధే కనిపిస్తుందని తెలిపారు. కాంగ్రెస్​ పార్టీ తట్టెడు మట్టి కూడా పోయదని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.