Kautilya School Of Public Policy: రాజకీయాల్లో వస్తామంటున్న యువత.. భవిష్యత్​ మొత్తం తమదేనట

By

Published : May 16, 2023, 4:25 PM IST

thumbnail

సమాజంలోని ఆర్థిక, సమాజిక అంతరాలను రూపుమాపేందుకు తాము ప్రయత్నిస్తామని కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థులు స్పష్టం చేశారు. పబ్లిక్ పాలసీ తయారీకి నిపుణులను.. భవిష్యత్​కు సరైన రాజకీయ నాయకులను అందిచాలన్న లక్ష్యంతో గీతం విశ్వవిద్యాలయం కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీని ఏర్పాటు చేసింది. రెండు సంవత్సరాల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులు.. ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులు మీదగా పట్టాలు అందుకున్నారు. రాజకీయాలే పాలసీ మేకింగ్​కు పునాది అని.. జనాల సమస్యలు తెలుసుకుంటేనే విధానాలు రూపొందించగలమని యువత అంటున్నారు. ప్రతి ఒక్క రంగంలోనూ నూతన పాలసీలు అవసరమని గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసిన యువత చెపుతున్నారు. భవిష్యత్తులో పాలసీ మేకింగ్​ అడ్వైజర్లుగా ఉంటామని విద్యార్ధులు వెల్లడించారు. విద్య, వ్యవసాయ రంగాల్లో దేశంలో నూతన పాలసీ అవసరం.. ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తాం అంటున్న నవ పాలసీ తయారీదారులు.. భవిష్యత్ రాజకీయ నాయకులతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.