ED Raids on transstroy మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు..

By

Published : Aug 1, 2023, 12:29 PM IST

thumbnail

Enforcement Directorate Raids in Rayapati Sambasiva Rao House:  ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లు కార్యాలయాల్లో ఈడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మలినేని సాంబశివరావుతో పాటు ఇతర డైరెక్టర్ల ఇళ్లు కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్​, గుంటూరులోని ఇళ్లు, కార్యాలయాలు కలుపుకుని ఇలా 9 ప్రాంతాల్లో అధికారులు ఒకేసారి సోదాలు నిర్వహిస్తున్నారు.  సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసి సోదాలు చేపట్టారు. ట్రాన్స్​ట్రాయ్ కంపెనీపై గతంలోనూ సీబీఐ కేసు నమోదు చేయగా.. ప్రస్తుతం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 27లో ఉన్న రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఈడి అధికారులు సోదాలు చేపట్టారు. దాదాపు 13 బ్యాంకుల నుంచి 9వేల కోట్లకు పైగా రుణాలను ట్రాన్స్​ట్రాయ్ కంపెనీ తీసుకుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. ట్రాన్స్​ట్రాయ్ కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్​కు నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ అయినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.