త్వరలోనే ఎయిమ్స్​లో డ్రోన్ సేవలు - ఇక నిమిషాల్లోనే పరీక్షల ఫలితాలు

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2024, 2:27 PM IST

thumbnail

Drone Services at Bibinagar AIIMS : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆధ్వర్యంలో డ్రోన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అందుకోసం ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా పీహెచ్​సీల నుంచి జిల్లా కేంద్ర ఆస్పత్రికి నిమిషాల్లో శాంపిల్స్​ను చేరవేశారు. రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్ నిమిషాల్లోనే ల్యాబ్​కు పంపించి పరీక్షలు చేసేందుకు డ్రోన్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాట్లు చేస్తోంది. డ్రోన్స్ వివిధ ఔషధాలను త్వరితగతిన చేరవేసేందుకు కూడా ఉపయోగపడతాయని అధికారులు అంటున్నారు.

Drone Services At AIIMS Hyderabad : ప్రయోగాత్మకంగా కొండమడుగు, బొమ్మలరామారం, భువనగిరి మండలంలో బొల్లేపల్లి పీహెచ్​సీలను బీబీనగర్ ఎయిమ్స్ ఎంపిక చేసింది. డ్రోన్ సేవలు తొలుత టీబీ రోగులకు అందించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా పీహెచ్​సీలలో టీబీ ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల నుంచి సేకరించిన శాంపిల్స్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి, అక్కడ పరీక్షించిన అనంతరం ఫలితాలను పీహెచ్​సీ వైద్యులకు పంపిస్తామని వెల్లడించింది. ఈ ప్రక్రియను కేవలం అరగంటలోనే పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో త్వరలో సేవలను ప్రారంభిస్తామని బీబీనగర్ ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. డ్రోన్​ 25 కిలోల బరువును 34 కిలోమీటర్ల దూరం వరకు తీసుకు వెళ్లగలదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.