వంద రోజుల తర్వాత మా పప్పులు ఉడకడం కాదు బిర్యానీ కూడా ఉడుకుతుంది : బండ్ల గణేశ్​

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2024, 3:38 PM IST

thumbnail

Cong Leader Bandla Ganesh fires on KTR : రేవంత్​రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో నెల రోజుల పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు చూసి ఓర్వలేకపోతున్నారని కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్​ పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీపై కేటీఆర్, హరీష్ రావు​కి ఈర్ష్య పీక్​ స్టేజ్​కి చేరిందన్నారు. వందరోజుల తర్వాత కాంగ్రెస్​ పప్పులు ఉడకవని వ్యాఖ్యనించిన హరీశ్​రావుపై వ్యంగ్యంగా, మా పప్పులు ఉడకడం కాదు బిర్యాని కూడా ఉడుకుతుందని బండ్ల గణేశ్​ కౌంటర్​ చేశారు. 

ఈ పది సంవత్సరాలు బీఆర్​ఎస్​ నాయకులు ఏం చేశారని, తెలంగాణకు రావలసిన హామీలపై ఎప్పుడైనా కేంద్రంతో కొట్లాడారా అని ప్రశ్నించారు. రేవంత్​రెడ్డి, మంత్రులు దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ తెలంగాణకి రావలసిన నిధులు పోరాటం చేస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్​రెడ్డి అవినీతి అధికారులను పక్కకు తప్పించి నిజాయితీ అధికారులను నియమించుకొని పరిపాలన చేస్తున్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఒక్క స్థానం కూడా గెలవదని బండ్ల గణేశ్​ స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.